తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్ కొత్తరూపు సంతరించుకోనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26.49 కోట్లతో మంచిర్యాల రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్ కొత్తరూపు సంతరించుకోనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26.49 కోట్లతో మంచిర్యాల రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులకు ఆఽధునిక ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రైల్వేస్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలతోపాటు మెరుగైన సేవలను అందించాలని సంకల్పించినట్లు సోమవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. మంచిర్యాల రైల్వేస్టేషన్కు సంబంధించిన ప్రతిపాదిత డిజైన్ను ఆయన పంచుకున్నారు.