తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. మీసేవా కేంద్రాల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
జగిత్యాల జిల్లా ప్రజలకు ఒక కొత్త అవకాశంగా, నాలుగు కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వీటిని భీమారం, మోరపల్లి, రంగపేట్, జగ్గాసాగర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. నవంబర్ 26 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ డిసెంబర్ 4గా నిర్ణయించారు.

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను జగిత్యాల జిల్లా అధికారిక వెబ్సైట్ https://www.jagtial.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫారమ్ నింపిన తర్వాత సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తుదారులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.. అభ్యర్థి నిరుద్యోగిగా ఉండాలి. కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయసు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జగిత్యాల జిల్లా పరిధిలోని అదే మండలానికి చెందినవారు కావాలి.
అభ్యర్థి పేరుపై రూ.500 యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) జగిత్యాల జిల్లా కలెక్టర్ పేరుతో చెల్లించాలి. అకాడమిక్ సర్టిఫికెట్లు, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన ఆధార పత్రాలను సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులు మీ సేవా కేంద్రం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. కేంద్రం ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే ప్రారంభించాలి.
దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాల్లో.. పదవ తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్,
నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం. దరఖాస్తు పత్రాలకు గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్ తప్పనిసరి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు మాత్రమే పరీక్షకు అర్హులవుతారు. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలంగాణ స్టేట్ మీసేవా సేవలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఒక చక్కని అవకాశంగా నిలుస్తుంది. మీ సేవా కేంద్రాలు స్థానిక గ్రామాలకు సేవలందిస్తూ, యువత ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి తోడ్పడతాయి.